ఆంధ్రప్రదేశ్ (AP) లోని, భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది.ఢిల్లీ నుంచి భోగాపురంకు తొలి విమానం చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు దిగారు. వారికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.
Read also: Telangana Assembly : చంద్రబాబుకు అప్పుడే సూటిగా చెప్పా – రేవంత్ రెడ్డి

ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి
అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. మరో 4-5 నెలల్లో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం.విశాఖ ఎకనమిక్ రీజియన్కు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: