News Telugu: AP Accident: చింతూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ దినేష్ తక్షణ స్పందన..

Read Time:  1 min
Chintoor accident
Chintoor accident
FONT SIZE
GET APP

AP Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju district) చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం జిల్లా మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వైపు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు నియంత్రణ తప్పి లోయలో పడడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Read also: TTD: తిరుమలలో భక్తుల కోసం కొత్త సౌకర్యాలు

Chintoor accident

Collector Dinesh’s immediate response to the Chintoor accident

సహాయక చర్యలు వేగంగా అమలు చేస్తున్నట్లు

AP Accident: ప్రమాదం తెలుసుకున్న వెంటనే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత శాఖలతో అత్యవసర సమీక్ష చేపట్టారు. సబ్ కలెక్టర్ సహా మొత్తం యంత్రాంగం ఘటనాస్థలానికి చేరి సహాయక చర్యలు వేగంగా అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చిన్న గాయాలున్న ఆరుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు.

12వ తేదీ తెల్లవారుజామున ప్రమాదానికి

ఈ ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లా మురుకంబట్టు ప్రాంతానికి చెందిన ఏవీఎం ట్రాన్స్‌పోర్ట్స్‌కు చెందినదిగా సమాచారం. ఓనర్ ఏకే రామ్మూర్తి ఈ బస్సును టూర్ ఏజెంట్ వజ్రం ద్వారా ఏడు రోజుల టూరుకు బుక్ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 6వ తేదీ చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ బస్సు 12వ తేదీ తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.