ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. అనారోగ్యంతో మృతి చెందిన ఆరేళ్ల కొడుకును కోల్పోయిన ఓ తండ్రి, తన బిడ్డ సమాధి భద్రత కోసం CCTV Camera ఏర్పాటు చేశాడు. క్షుద్ర పూజల కోసం ఎవరైనా మృతదేహాన్ని తవ్వేస్తారేమోనన్న భయమే ఈ నిర్ణయానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విస్తృత చర్చకు దారి తీసింది.
Read also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

AP
కొడుకు మృతిని జీర్ణించుకోలేని తండ్రి
వివరాల్లోకి వెళితే, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన దంపతుల ఆరేళ్ల కుమారుడు ఈ నెల 8వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మరణంతో తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. సంప్రదాయం ప్రకారం బాలుడిని గ్రామ శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే కొడుకు మృతిని జీర్ణించుకోలేని తండ్రి, సమాధి భద్రతపై అనుమానంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు.
ఈ భయంతోనే సమాధి వద్ద Solar Power ద్వారా పనిచేసే సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఆ కెమెరా ఫుటేజీ నేరుగా తండ్రి మొబైల్ ఫోన్కు కనెక్ట్ అయి ఉండటంతో రోజూ సమాధిని పర్యవేక్షిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఈ ప్రాంతంలో క్షుద్ర పూజల ఘటనలు లేవని స్పష్టం చేసినప్పటికీ, కన్నకొడుకు జ్ఞాపకాలతో జీవిస్తున్న ఆ తండ్రి మాత్రం తన బిడ్డ సమాధి రక్షణ కోసం నిఘాను కొనసాగిస్తూనే ఉన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: