हिन्दी | Epaper

Anna lezhinova:తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు

vishnuSeo
Anna lezhinova:తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు
   Anna lezhinova
అన్నా లెజినోవా తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు

అన్నా లెజినోవా సంప్రదాయ దుస్తుల్లో తిరుమల దర్శనం

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ, టిటిడి ఆలయ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చీర ధరించి సంప్రదాయ హిందూ ఆడపడుచులా ఆమె సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో ఆద్యంతం ఆమె భక్తి భావంతో గడిపారు. స్వామివారికి కానుకలు సమర్పించగా, రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న లెజినోవా

ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ స్వల్ప గాయాల నుంచి కోలుకున్న తర్వాత, ఆపదమొక్కుల వెంకన్నకు మొక్కులు తీర్చేందుకు Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి నీలాలు సమర్పించి, వరాహస్వామిని దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆమె 17 లక్షల రూపాయల విరాళాన్ని టిటిడి అధికారులకు అందజేసి, భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించి, తానే అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.

పవన్ అభిమానుల సందడి – భక్తుల మనసులు గెలుచుకున్న లెజినోవా

ఈ సందర్భంగా ఆమెను టిటిడి అదనపు ఈఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలసి పలకరించారు. తిరుమలలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి, సంపూర్ణ భక్తితో ఆలయ దర్శనం నిర్వహించారు. శ్రీవారి చిత్రపటానికి హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టారు. పరామర్శించాలని పవన్ కల్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు తిరుమలలో జమయ్యారు. మధ్యాహ్నం Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు ప్రయాణించారు. కుమారుడి ఆరోగ్య కోలుకై శ్రీవారికి మొక్కు తీర్చిన ఆమె భక్తి, వినయంతో ఆదర్శంగా నిలిచారు.

Read more : Bhumana Karunakar Reddy: మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన భూమన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870