Andhra University: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (AU) క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎస్ఎఫ్ఐకు వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ వీసీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఎస్ఎఫ్ఐ నేతలు కూడా ప్రతినినాదాలతో స్పందించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది.
Read Also:Ambati Rambabu: రాంబాబుకు బెయిల్ మంజూరు

తొపులాట జరగడంతో క్యాంపస్లో ఉద్రిక్తత పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా యూనివర్సిటీ ప్రధాన గేట్లకు తాళాలు వేసి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు.
ఇటీవల ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించాల్సిన ఆర్ఎస్ఎస్ మార్చ్ను ఎస్ఎఫ్ఐ అడ్డుకున్న ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. అదే అంశం చుట్టూ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాంపస్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు శాంతియుతంగా ఉండాలని సూచిస్తూ, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: