Andhra Pradesh medical drones : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ‘సంజీవని’ పేరుతో మెడికల్ డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును అల్లూరి సీతారామరాజు జిల్లాలో విజయవంతంగా అమలు చేసింది. రహదారి సౌకర్యాలు లేని అడవి గ్రామాలకు ఈ డ్రోన్లు ఇప్పుడు ప్రాణాధారంగా మారుతున్నాయి.
జిల్లాలోని వేలాది గిరిజన గ్రామాలకు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుకోవడం కష్టసాధ్యమవుతోంది. వాగులు, కొండలు దాటుకుంటూ రోగులను డోలీలపై తరలించాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని బెంగళూరుకు చెందిన Redwing Labs సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ వినూత్న సేవలను ప్రారంభించింది.
Read Also: Manipur Violence: మణిపుర్లో మరోసారి అల్లర్లు

ఈ మెడికల్ డ్రోన్లు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో అత్యవసర మందులు, వ్యాక్సిన్లు, రక్తపు యూనిట్లు, పాము కాటు చికిత్స మందులను గ్రామాలకు చేరవేస్తాయి. శాటిలైట్ ట్రాకింగ్, ఆటోమేటెడ్ నావిగేషన్ సాఫ్ట్వేర్తో పనిచేసే ఈ డ్రోన్లు 5 కిలోల వరకు బరువు మోయగలవు. అంతేకాదు, రోగుల రక్త నమూనాలను తిరిగి ఆసుపత్రులకు తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించే సదుపాయం కూడా కల్పించాయి. పాడేరు డిగ్రీ కాలేజీని ప్రధాన హబ్గా చేసుకుని ఈ సేవలను సమన్వయం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: