हिन्दी | Epaper

Andhra Pradesh politics: ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ డిన్నర్ మీటింగ్ లు

Rajitha
Andhra Pradesh politics: ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ డిన్నర్ మీటింగ్ లు

విజయవాడ : పార్టీ బలోపేతం విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara lokesh) వినూత్న పంథా ఎంచుకున్నారు. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ.. ఎమ్మెల్యేలు, క్యాడర్కు మరింత దగ్గరయ్యేలా డిన్నర్ మీటింగ్ లకు శ్రీకారం చుట్టారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. ఆత్మీయ వాతావరణంలో ప్రతి రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో భోజనం చేస్తూ..వారి మనోగతాలు తెలుసుకుంటున్నారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా నియోజకవర్గాల అభివృద్ధి, పెండింగ్లో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్నారు.

Read also: TTD: స్వామి వారికీ బ్యాటరీ వాహనాలు ఇచ్చి తన ఉదారతను చాటుకున్న భక్తుడు

Minister Lokesh's dinner meetings with MLAs

Minister Lokesh’s dinner meetings with MLAs

కేవలం ఆఫీసు గోడల మధ్య కాకుండా, డైనింగ్ టేబుల్ పై సాగే చర్చల వల్ల

నారా లోకేష్. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ, వారి వ్యక్తిగత యోగక్షేమాలతో పాటు స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే వెంటనే పరిష్కరించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేవలం ఆఫీసు గోడల మధ్య కాకుండా, డైనింగ్ టేబుల్పై సాగే చర్చల వల్ల ఎమ్మెల్యేలతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందని లోకేష్ భావిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపై లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనుభవం లేక కొంతమంది చేస్తున్న చిన్నపాటి పొరపాట్లను సరిదిద్దేందుకు ఈ వేదికను వాడుకుంటున్నారు. వార్నింగ్, గదమాయింపులు కాకుండా.. ఓ ఫ్రెండ్లో, ఓ మెంటార్ పాలనపై అవగాహన కల్పిస్తున్నారు.

యువ ఎమ్మెల్యేలకి మార్గదర్శకత్వం

హైకమాండ్, యువ ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం ద్వారా పార్టీకి క్రమశిక్షణ కలిగిన నాయకత్వాన్ని అందించడమే ఈ సమావేశాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీని వాడుకుంటూ డాష్ బోర్డుల ద్వారా డెవలప్మెంట్ కాదు క్షేత్రస్థాయిలో మమేకమవ్వడం తన శైలి అని లోకేష్ నిరూపిస్తున్నారు. సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తూనే, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న తీరు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని కలిగిస్తోంది. ఈ డిన్నర్ మీటింగ్స్ ద్వారా ఆయన వేస్తున్న అడుగులు అటు పార్టీ ఐక్యతను, ఇటు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870