ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. డీఎస్సీలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్కు సంబంధించి ఒక పేపర్గా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
Read also: Bapatla: పూరిగుడిసె దగ్ధం.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
ఉపాధ్యాయుల కొరత
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, బోధన నాణ్యతపై దీని ప్రభావం పడుతోందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీఎస్సీ నిర్వహణకు సంబంధించి పోస్టుల గుర్తింపు, రిజర్వేషన్ విధానం, పరీక్షా విధానంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ డీఎస్సీకి సంబంధించి మరో ముఖ్యమైన మార్పును కూడా విద్యాశాఖ పరిశీలిస్తోంది.

ఇంగ్లిష్, కంప్యూటర్ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో, డీఎస్సీలో కొత్తగా ఒక ప్రత్యేక పేపర్ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉన్న సిలబస్తో పాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ అవగాహన, డిజిటల్ లెర్నింగ్ అంశాలపై పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే, ఈ మార్పులకు సంబంధించి ఇంకా ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: