हिन्दी | Epaper

Amaravati : అమరావతి మునిగి పోయినట్లుగా వైసీపీ దుష్ప్రచారం పై మండిపడ్డ మంత్రి నారాయణ

Shravan
Amaravati : అమరావతి మునిగి పోయినట్లుగా వైసీపీ దుష్ప్రచారం పై మండిపడ్డ మంత్రి నారాయణ

విజయవాడ Amaravati : రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోన్న వైసీపీ నాయకులపై (YCP leaders) మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు… అమరావతిలో కొండవీటి వాగు నీటి ప్రవాహానికి ఆటంకం కలగడంతో వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు… అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి తో కలిసి ఆయా ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. విజయవాడ పశ్చిమ బైపాస్ పై ఈ 11 రోడ్డు వద్ద కొండవీటి వాగుపై నేషనల్ హైవేస్ అధికారులు ఓ వంతెన నిర్మించారు… ఈ వంతెన నిర్మాణ సమయంలో అక్కడ మట్టిని అలాగే వదిలేయడంతో అక్కడే కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది…దీంతో వంతెన దిగువ నుంచి నీరు వెళ్లే మార్టం లేక నీరుకొండ పరిసర ప్రాంతాల్లో పొలాల్లో వరద నీరు నిలిచిపోయింది…. వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి నారాయణ (Minister Narayana) అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసారు… ప్రొక్లెయిన్ లు ఏర్పాటు చేసి మట్టి తొలగించడంతో పాటు జాతీయ రహదారి పై కూడా స్వల్పంగా గండి కొట్టి నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు… ఆ తర్వాత అక్కడి కొచ్చిన మీడియాతో మంత్రి నారాయణ మాట్తడుతూ వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిపై ఇకనైనా మీ ఏడుపులు ఆపాలంటూ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

Amaravati

అమరావతిపై దుష్ప్రచారాన్ని ఖండించిన మంత్రి

లేదంటే ఈసారి 11 సీట్లు కూడా ప్రజలు మీకివ్వరన్నారు… ఎక్కడైనా నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా…? గుంతల్లోకి నీరు వస్తె ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా? అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు.. అమరావతిపై దుష్ప్రచారం (Bad publicity against Amaravati) చేస్తే ప్రజలు సహించరని అన్నారు. పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయిందన్న మంత్రి… అది కూడా కేవలం రెండు గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచిందన్నారు. మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే నీరు బయటికి వెళ్లిపోయిందన్నారు… ప్రస్తుతం కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టిని వేగంగా తొలగించే పనులు వేగంగా జరుగుతున్నా యన్నారు. మంత్రి.. ఎవరెన్ని అనుకున్నా అమరావతి పనులు జరిగిపోతూనే ఉంటాయన్నారు.. వచ్చే మార్చి నాటికి అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లు కూడా సిద్ధం చేస్తున్నా మన్నారు… రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నవారు వచ్చిచూడాలి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/flood-alert-heavy-flood-at-prakasam-barrage/andhra-pradesh/532984/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870