Latest News: Amaravati: రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు పెన్షన్

Read Time:  1 min
Amaravati
Amaravati
FONT SIZE
GET APP

పెన్షన్ పథకం పునరుద్ధరణ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(Amaravati) పరిధిలోని భూమిలేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం నిలిపివేసిన పింఛన్ల పథకాన్ని పునరుద్ధరించాలని రాజ ధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్ డీఏ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా 4,929 మంది పేదలకు నెలకు రూ.5 వేల చొప్పున పింఛను అందనుంది. రాజధాని కోసం భూసమీకరణ జరిగినప్పుడు, భూమి లేక ఉపాధి కోల్పోయిన పేదల కోసం ప్రభుత్వం ఈ పింఛన్ పథకాన్ని ప్రారంభించింది.

Read also: అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

Amaravati
Amaravati For landless poor people in the capital region

అమరావతి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం

అయితే, వైసీపీ ప్రభుత్వం(Amaravati) అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు నిలిపివేయడంతో పాటు ఈ పింఛన్లను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో, అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పింఛన్లను పునరుద్ధరించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఈ విషయంపై సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ల కోసం త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో గానీ, గ్రామసభల ద్వారా గానీ పేదలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలోని వేలాది పేద కుటుంబాలకు ఆర్థికంగా ఊరట దక్కుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.