అనంతపురంలో గురువారం రాత్రి అఖండ–2 విడుదల సందడి అమాంతం పెరిగిపోయింది. నందమూరి బాలకృష్ణపై (Nandamuri Balakrishna) అభిమానంతో ఇద్దరు ఎమ్మెల్యేలు స్వయంగా ర్యాలీల్లో పాల్గొని అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఆటోలు, బుల్లెట్లు, డీజే డ్రమ్స్తో అనంత వీధులంతా సందడిగా మారాయి.

Akhanda 2
టపాసులు పేలుస్తూ ఘనంగా వేడుకలు
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తన కార్యాలయం నుంచి గౌరీ థియేటర్ దాకా భారీ బైక్ ర్యాలీ చేశారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాంనగర్ నుంచి త్రివేణి థియేటర్ వరకు ఆటో ర్యాలీతో అభిమానులను అలరించారు. బాలయ్య ఫోటోలు, అఖండ జెండాలు పట్టుకుని పాల్గొన్న అభిమానులు టపాసులు పేలుస్తూ ఘనంగా వేడుకలు జరిపారు.
అభిమానుల సందడి గరిష్ఠ స్థాయికి
తరువాత ఎమ్మెల్యేలు ఇద్దరూ గౌరీ థియేటర్ వద్ద శివలింగాభిషేకం చేసి విజయవంతమైన రీలీజ్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎన్బీకే ఫ్యాన్స్ నాయకుడు గౌస్ మొద్దీన్ ఆధ్వర్యంలో బాలయ్య చిత్రపటానికి హారతులు పెట్టారు. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్, మదమంచి శ్రీనివాసులు సహా పలువురు అభిమానులు కూడా పాల్గొన్నారు. బెనిఫిట్ షో గురువారం రాత్రే ఉండటంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: