గోరుకల్లు (Gorukallu Reservoir)బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో ఉంది. రాయలసీమకు నీటి ప్రాణవాయువుగా నిలిచిన ఈ జలాశయానికి, శాశ్వత మరమ్మతులు చేయకపోతే భారీ ప్రమాదం తప్పదని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.రిజర్వాయర్లోని (In the reservoir) రాతి పరుపు (స్టోన్ రివెట్మెంట్) నాలుగు చోట్ల నీటిలోకి జారిపోతుండడంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. మట్టి ఆనకట్టను పూర్తిగా నిర్మించకపోవడం వల్ల వర్షపు నీరు మట్టి, రాతి మధ్యకి చేరుతోంది. దీని ప్రభావంతో శాండ్ ఫిల్టర్ మీడియా వాష్ అవుట్ అయి, రాతిపరుపు కుంగిపోతోంది.ఈ నెల 13న సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ అధికారులు రిజర్వాయర్ను పరిశీలించారు. తక్షణమే మట్టికట్ట బ్యాలెన్స్ పనులు, అప్టెక్ స్లూయిస్, డ్రైన్ నిర్మాణం మొదలుపెట్టాలని సూచించారు. కానీ ఇప్పటివరకు నిధుల మంజూరులో స్పష్టత లేదు.

రూ.58 కోట్ల ప్రతిపాదనలు పెండింగ్లోనే
ఇంజనీర్లు రూ.58 కోట్ల శాశ్వత మరమ్మతుల ప్రణాళికను పంపారు. తాత్కాలికంగా నంద్యాల కలెక్టర్ డీఎంఎఫ్ నిధుల కింద రూ.2.50 కోట్లు విడుదల చేశారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారమే. శాశ్వత భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం.
2023 నుంచే ప్రమాద సంకేతాలు
గతేడాది మేలోనే మట్టికట్ట రెండు చోట్ల కుంగిపోయింది. అప్పటి నుంచే సమస్యను తక్కువగా చూసారు. వైసీపీ పాలనలో బ్యాలెన్స్ పనులు నిర్లక్ష్యం చేయబడటం వల్ల పరిస్థితి మరింత చేదుగా మారింది. 2,600 మీటర్ల నుంచి 3,400 మీటర్ల మధ్యలో 150-200 మీటర్ల మేర రాతిపరుపు జారి పోయిందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
కీలక ప్రాజెక్ట్ ప్రమాదంలో
గోరుకల్లు రిజర్వాయర్ గాలేరు-నగరి ప్రాజెక్టులో అత్యంత కీలకం. ఇది 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మించారు. పైగా ఇది శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలను మళ్లించే మార్గంలో కీలకమైన భాగం.ప్రస్తుతం పరిస్థితిని చూసి ఇంజనీర్లు లైవ్ స్టోరేజ్ 11 టీఎంసీలకు మించకూడదని చెబుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కూడా సమస్యను గుర్తించారు. కలెక్టర్ ఇచ్చిన నిధులతో తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నా, శాశ్వత పరిష్కారమే దీర్ఘకాలిక భద్రతకు మార్గం.
Read Also : Inter Colleges : నేటి నుంచి ఏపీలో ఇంటర్ కాలేజీలు రీఓపెన్