కూటమి ప్రభుత్వం (Government) ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తయింది. గత ప్రభుత్వ పాలనతో దెబ్బతిన్న వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేసింది.ప్రజల బాగుకోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు రెండింటినీ సమాంతరంగా నడిపిస్తోంది. హామీలలో 70% ఇప్పటికే నెరవేర్చింది.దీపం-2 పథకం (Deepam-2 Scheme) ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబడుతున్నాయి. అలాగే ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం మొదలుకానుంది.విదేశీ విద్య పునఃప్రారంభం, మధ్యాహ్న భోజన పథకం, నో బ్యాగ్ డే వంటి వినూత్న కార్యక్రమాలు విద్య రంగాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.
రైతుల కోసం గట్టి చర్యలు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటి సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.పునరుత్పత్తి విద్యుత్ ప్రోత్సాహంతో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతోంది. కోతలు, పవర్ హాలిడేలు గతం కావడమే ఇందుకు నిదర్శనం.రూ.9.4 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. 8.5 లక్షల ఉద్యోగాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంటోంది
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోంది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు, డిజిటల్ భూ రికార్డుల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.ఈగల్ టాస్క్ఫోర్స్తో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి.
Read Also : Telangana New Ministers: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు