हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Mithun Reddy : మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట : ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ

Divya Vani M
Mithun Reddy : మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట : ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ

వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Mithun Reddy) అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కామ్‌ లో కీలక నిందితుడిగా మిథున్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న మిథున్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం (ACB court’s key decision on the petition) తీసుకుంది. జైలులో మౌలిక వసతులు కల్పించాలంటూ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.విజయవాడ ఏసీబీ కోర్టు విచారణలో, మిథున్‌కు వెస్ట్రన్ కమోడ్, మంచం, దుప్పటి, దిండు ఉండే గది ఇవ్వాలని తీర్పు వెలువరించింది. అవసరమైన మందులు, సహాయకుడు, వాటర్ బాటిల్స్, టేబుల్, పేపర్-పెన్నులు, అవసరమైతే టీవీ కూడా అందించేందుకు అనుమతి ఇచ్చింది.

Mithun Reddy : మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట : ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ
Mithun Reddy : మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట : ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ

ఖర్చు భారం మిథున్‌పైనే

ఈ ప్రత్యేక వసతులన్నిటికీ ఖర్చు భారం మిథున్‌ రెడ్డిపై ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. జైలు బయట నుంచి ఆహారం తీసుకురావాలంటే అండర్‌టేకింగ్ లెటర్ ఇవ్వాలన్నది కోర్టు స్పష్టమైన ఆదేశం.జైలులో మౌలిక వైద్య వసతులు కల్పించాలన్న కోర్టు, అవసరమైతే జైలు వెలుపల వైద్య సదుపాయం కూడా ఇవ్వాలని సూచించింది. ఇది మిథున్ ఆరోగ్య పరిరక్షణకు అనుకూలంగా మారనుంది.

కుటుంబ, న్యాయవాదుల పరంగా కూడా వెసులుబాటు

మిథున్‌ రెడ్డికి వారంలో మూడుసార్లు న్యాయవాదులను కలుసుకునే అవకాశం కల్పించనుంది కోర్టు. అలాగే కుటుంబ సభ్యులతో వారంలో రెండుసార్లు ములాఖత్‌కు అనుమతి ఇచ్చింది.కోర్టు ఆదేశాల వల్ల మిథున్‌కు స్వల్పంగా ఊరట లభించినా, కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. సిట్ నుంచి మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉండడంతో, రాజకీయంగా ఇది ఇంకా పెద్ద కేసుగానే ఉన్నది.

Read Also : Bandh : తెలంగాణ లో ఈరోజు స్కూళ్లు, కాలేజీలు బంద్ – ఎస్ఎఫ్ఎ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870