విజయవాడలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు A1 జనార్దనరావు మరియు A2 జగన్ మోహన్రావు లను 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం జనార్దనరావు నెల్లూరు జైలులో, జగన్ మోహన్రావు విజయవాడ జైలులో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు, పోలీసులు రేపు జగన్ మోహన్రావును కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక జనార్దనరావును ఎల్లుండి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ కస్టడీ సమయంలో నిందితుల నుంచి నకిలీ మద్యం తయారీ, సరఫరా నెట్వర్క్ వివరాలు, ఇతర సహచరుల పేర్లు వెలికి తీయాలని ఎక్సైజ్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
Latest News: Louvre Heist: చరిత్రలోనే పెద్ద దోపిడీ – 7 నిమిషాల్లో మ్యూజియం ఖాళీ
ఈ కేసులో మరో కీలక నిందితుడు A13 తిరుమలశెట్టి శ్రీనివాసన్ కస్టడీకి కూడా ఎక్సైజ్ శాఖ అభ్యర్థన దాఖలు చేసింది. అయితే, ఆ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. తిరుమలశెట్టి శ్రీనివాసన్ ఈ నకిలీ మద్యం తయారీ, పంపిణీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడనే అనుమానాలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారుల నివేదికల ప్రకారం, ఈ నకిలీ మద్యం కేసు ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. కస్టడీ విచారణలో నిందితుల నుంచి ముఖ్యమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రధాన నిందితుడు జనార్దనరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నకిలీ మద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం, అనేక మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తడం నేపథ్యంలో ప్రభుత్వం కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లపై దాడులు కొనసాగిస్తున్నాయి. నిందితుల కస్టడీ విచారణతో ఈ కేసు వెనుక ఉన్న పెద్ద రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విచారణాధికారులు చెబుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/