हिन्दी | Epaper

Andhra Pradesh: ఇళ్ల స్థలాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

Anusha
Andhra Pradesh: ఇళ్ల స్థలాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌లోని ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు శుభవార్త. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, తాజాగా శనివారం నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ (Online application) ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీని ద్వారా మరింత మందికి ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.దీంతో త్వరలోనే ఇళ్ల స్థలాల పంపిణీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇళ్ల నిర్మాణాలు

మరోవైపు ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల స్థలాల కోసం శనివారం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హులై ఉండి ఇళ్ల స్థలాలు కావాల్సిన వారు తమ ఆధార్ కార్డు. రేషన్ కార్డు (Ration card) లతో పాటుగా పాస్‌పోర్టు సైజు ఫోటోతో గ్రామ సచివాలయాలను సంప్రదించాలి. సచివాలయ సిబ్బందికి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో పట్టణాలలో సెంటు, గ్రామాలలో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. అయితే చాలామంది పట్టాలు తీసుకున్నప్పటికీ అందులో ఇళ్ల నిర్మాణాలు జరపలేదు.ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Andhra Pradesh: ఇళ్ల స్థలాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!
Andhra Pradesh: ఇళ్ల స్థలాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

దరఖాస్తుల స్వీకరణ

గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొంది ఇల్లు నిర్మించని వారికి కూడా ఈ పథకం వర్తింపజేయనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూములను సేకరించారు. అవసరమైతే ఆ భూములకు అదనంగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలుకాగా, లబ్ధిదారులలో ఆనందం వ్యక్తమవుతోంది.మరోవైపు టిడ్కో ఇళ్ల (Tidco houses) లబ్ధిదారులకు కూడా వచ్చే సంక్రాంతి నాటికి టిడ్కో ఇళ్లు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సంక్రాంతి నాటికి ఇళ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయిస్తామని ఏపీ టిడ్కో కార్పొరేషన్ ఛైర్మన్ కూడా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌కు ఏమి ప్రత్యేకత ఉంది?

ఆంధ్రప్రదేశ్‌ అనేది సాంస్కృతిక, భౌగోళిక, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన రాష్ట్రం.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంపన్నమైన నగరం ఏది?

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం (Visakhapatnam)ను సాధారణంగా అత్యంత సంపన్న నగరంగా పరిగణిస్తారు. ఈ నగరం రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ముఖ్యమైన హబ్‌గా పనిచేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Andhra Pradesh: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇంటి నుంచే రిజిస్టర్ పోస్ట్ బుక్ చేయొచ్చు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

📢 For Advertisement Booking: 98481 12870