Anchor Shyamala appears before the police

Anchor shyamala : పోలీసుల ఎదుట హాజరైన యాంకర్‌ శ్యామల

Anchor shyamala: బెట్టింగ్ యాప్‌ లు ప్ర‌మోట్ చేసిన కేసులో త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టు లో క్వాష్ పిటిష‌న్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయ‌స్థానం ఆమెను అరెస్టు చేయొద్ద‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిందిగా యాంకర్ శ్యామలకు సూచించారు. ఈ క్రమంలో యాంక‌ర్ శ్యామ‌ల ఈరోజు(సోమవారం) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

పోలీసుల ఎదుట హాజరైన యాంకర్‌

పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు

ఈ తరుణంలో యాంకర్ శ్యామలతో పాటు నేడు విచారణకు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ లు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్‌లు ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. వీరి ఇరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్ప‌టికే మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ రీతూచౌద‌రి, టీవీ యాంక‌ర్ విష్ణుప్రియ‌లు సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు

ఇక యాంకర్ శ్యామల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీంతో ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఉన్న కారణంగా నటి శ్యామల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వైసీపీ ప్రతినిధి అంటూ మండిపడుతున్నారు. తెలుగు తమ్ముళ్లు పంజాగుట్ట పిఎస్ కు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల అంటూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

Related Posts
ఒకే రోజున లక్ష రేషన్ కార్డు లు
ఒకే రోజున లక్ష రేషన్ కార్డు లు

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నూతన దశలోకి ప్రవేశించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని Read more

మారనున్న KBC హోస్ట్!
bigb

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) షోకు హోస్ట్‌గా గడిపిన సంవత్సరాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, Read more

ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
Polling for Delhi Assembly elections is over

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ Read more

AP assembly : ఇవాళ ఎమ్మెల్యేల గ్రూప్ ఫొటో
AP assembly 2025 ఇవాళ ఎమ్మెల్యేల గ్రూప్ ఫొటో

AP assembly : ఇవాళ ఎమ్మెల్యేల గ్రూప్ ఫొటో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇవాళ చారిత్రాత్మక దృశ్యాలు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *