AMit shah, maharashtra cm m

అర్ధరాత్రి అమిత్ షా, ఫడ్నవీస్ భేటీ..

కేంద్రమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చర్చలు జరగడం వల్ల ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫడణవీస్, అమిత్ షా మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో అలకబూనిన ఏక్‌నాథ్ శిండే ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనను బీజేపీ నాయకత్వం ఒప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా, ఫడణవీస్ మధ్య సమావేశం జరిగిందని అంటున్నారు.

కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరికీ ఏ పదవి ఇవ్వాలి? అనే అంశంపై కూడా విస్తృతంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. రాష్ట్రంలో శిండే వర్గం, బీజేపీ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఒత్తిళ్లు ఈ విస్తరణకు కీలకమైన విషయం కావడం గమనార్హం. మహారాష్ట్రలో శిండే వర్గం బీజేపీపై పూర్తి ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుండగా, బీజేపీ మాత్రం జాతీయ ప్రాధాన్యతతో నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో శిండేను బీజేపీ ఎలా ఒప్పిస్తుంది? అనే దానిపై రాజకీయ పరిశీలకుల దృష్టి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అమిత్ షా, ఫడణవీస్ భేటీ మహారాష్ట్ర రాజకీయాలలో నూతన మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై త్వరలోనే స్పష్టత వస్తుందని అంచనా.

Related Posts
కుంభమేళా భక్తులకు సగం ధరకే విమాన టికెట్ల ధరలు
kumbh mela flight charges

కుంభమేళా సందర్భంగా భక్తులకు సగం ధరకే విమాన టికెట్లు అందించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయం భక్తులకు ఆర్థిక భారం తగ్గించేందుకు సహాయపడనుంది. Read more

ఏపీలో మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు
Servers of registration dep

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో భారీ రద్దీ నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో, ప్రజలు గుత్తుగా Read more

Tollgate : రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!
రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!

దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకువస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల Read more

కానిస్టేబుళ్లు నిరసన..సచివాలయం వద్ద సెక్షన్ 163 అమలు
Constables protest.Implementation of Section 163 at Secretariat

హైదరాబాద్‌: తెలంగాణలో వివిధ బెటాలియన్లకు చెందిన కానిస్టేబుళ్లు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. 'ఏక్ పోలీస్.. ఏక్ స్టేట్' విధానాన్ని అమలు చేయాలని కోరుతూ వారు గత Read more