పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన శైలజ అనే యువతి రెండు సంవత్సరాల క్రితం తాను ప్రేమించిన వ్యక్తి సతీష్ ను కులాంతర వివాహం చేసుకుంది. ఈ పెళ్లి శైలజ తల్లికి ఇష్టంలేకపోయినా, శైలజ తన ఇష్టానుసారం జీవితం ప్రారంభించింది. ఈ దంపతులకు యశ్విత అనే కుమార్తె జన్మించింది. అయితే సతీష్తో మధ్యలో విభేదాలు రావడంతో శైలజ, బిడ్డను తీసుకుని తన పుట్టింటికి తిరిగి వెళ్లింది. అక్కడ నుంచి కథకు కొత్త మలుపు మొదలైంది. మొదట కూతురితో విరక్తంగా ఉన్న శైలజ తల్లి నెమ్మదిగా శైలజ మనసు మార్చింది. శైలజను తమ కులంలోనే మరొక యువకుడితో పెళ్లి చేయాలనే ఆలోచనతో ఆమెను ప్రభావితం చేసింది. అయితే ఈ రెండో పెళ్లికి యశ్విత అడ్డుగానే నిలుస్తుందని భావించి, తల్లీకూతుళ్లు కలిసే పసికందును హత్య చేయాలని కుట్ర పన్నారు.

ఘోర హత్య:
మే 6న రాత్రి ఈ పథకం అమలు చేశారు. రెండవ వివాహానికి బిడ్డ అడ్డంగా ఉద్దేశంతో బిడ్డను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు. ఈ నెల 6న పసికందు యశ్విత గొంతు నులిమి హత్య చేశారు. ఆపై పక్కింట్లోని బావిలో పడేశారు. గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి తన బిడ్డను చంపేశారని శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులను నమ్మించేందుకు ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు జరిగినట్లు తల్లీకూతుళ్లు సీన్ సృష్టించారు.
పోలీసులు దర్యాప్తు
అయితే తల్లీకూతుళ్ల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో, పోలీసులు తమదైన శైలిలో విచారించగా తాము చేసిన ఘోరాన్ని వారు బయటపెట్టారు. రెండో పెళ్లికి అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో తామే పసిబిడ్డను హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు.
Read also: Road Accident: పల్నాడు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి