Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమలను తలపించేలా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో ఈ ఆలయం దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారేలా ఆకర్షణీయంగా అభివృద్ధి చేయనున్నారు.ఈ ఆలయం చుట్టూ భారీ ప్రాకారం ఉండగా, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తుల మహారాజ గోపురం నిర్మించనున్నారు. అంతేకాదు మూడు దిశల్లో ఐదు అంతస్తుల గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితోపాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇదే ఆలయాన్ని నిర్మించేందుకు 2016లో టీడీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.

Advertisements
Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

అమరావతిలోని వెంకటపాలెం వద్ద 25 ఎకరాల భూమిని కేటాయించి, రూ. 150 కోట్ల వ్యయంతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు.2018లో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.అయితే కొన్ని కారణాల వల్ల ఆలయ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టుకు నిర్దేశించిన రూ. 150 కోట్ల అంచనా వ్యయాన్ని కేవలం రూ. 36 కోట్లకు తగ్గించడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి.ఈ క్రమంలో ప్రధాన ఆలయం, లోపలి ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభ మండపం మాత్రమే నిర్మించబడింది.ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ఆలయ నిర్మాణాన్ని మరింత వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించేందుకు అవసరమైన నిధులు, రివైజ్డ్ ప్రణాళికలతో ముందుకెళ్లనున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

Related Posts
రోజువారీ ఆధ్యాత్మిక మార్గదర్శనం
Adhyatmika

ప్రతి రోజూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి.ఈ వనరులు మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, సంతృప్తిగా జీవించడానికి సహాయపడతాయి. ఉదాహరణకు,వేదికలు ప్రతి రోజూ Read more

Delimitation: డెలిమిటేషన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు
Delimitation: గోరంట్ల బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన అంశాల్లో డీలిమిటేషన్ ఒకటి. ఇది దక్షిణాది రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ మధ్య ప్రచ్చన్న యుద్ధాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధానంగా Read more

రామగుండంలో రూ.29,345 కోట్లతో పవర్ ప్రాజెక్టు
Ramagundam NTPC

రామగుండంలో NTPC ఆధ్వర్యంలో కొత్త సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు 2400 మెగావాట్ల సామర్థ్యంతో (3,800 మెగావాట్ల యూనిట్లు) నిర్మించబడుతుంది. దీనికి Read more

మార్చి 17 నుంచి ఏపీ లోటెన్త్‌ ఎగ్జామ్స్
మార్చి 17 నుంచి ఏపీ లోటెన్త్‌ ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్ లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×