టాలీవుడ్లో రెండు ప్రముఖ కుటుంబాలైన మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయా? అన్న ప్రశ్నకు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ డిస్కషన్ నడుస్తోంది. గత కొంతకాలంగా ఈ రెండు ఫ్యామిలీల మధ్య చిచ్చు రాజుకుంటూ వస్తుందనే వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ పర్మానెంట్గా అతన్ని అన్ఫాలో చేయడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది.

వివాదానికి మూలం – రాజకీయ కారణమా?
వాస్తవానికి మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీతో ముడిపాటు ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ సహా మెగా కుటుంబానికి చెందిన చాలా మంది పవన్కు పూర్తి మద్దతుగా ఉన్నారు. అయితే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ మాత్రం జనసేనను కాకుండా, వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మెగా ఫ్యాన్స్కు నచ్చలేదు. అల్లు అర్జున్ మద్దతిచ్చిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీనితో రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వైపు మెగా ఫ్యామిలీ మొత్తం నిలిచిపోయి, అల్లు ఫ్యామిలీ మాత్రం కొంత దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా విడుదలకు ముందు ఆయనపై మెగా ఫ్యాన్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జనసేనను వ్యతిరేకించిన వ్యక్తిగా ఆయన్ని బహిష్కరించాలని కొందరు అభిమానులు కోరారు. అంతేకాదు, మెగా హీరోలెవరూ కూడా ‘పుష్ప 2’ గురించి ఏ ఒక్క మాట మాట్లాడలేదు. ఇది కూడా వివాదాన్ని మరింత ముదిరించిందని భావిస్తున్నారు. పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్ అయినప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు స్పందించలేదు. అంతే కాదు, అల్లు అర్జున్ ఇటీవల అరెస్ట్ అయిన ఘటనపై కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు. అంతే కాకుండా, ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కొన్ని సందర్భాల్లో సెటైర్లు వేసినట్లు సమాచారం. ఇది కూడా రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా – అన్ఫాలో
మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరినట్టు స్పష్టమైన ఉదాహరణగా రామ్ చరణ్ అల్లు అర్జున్ను అన్ఫాలో చేయడం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేయడం టాలీవుడ్లో అంత సులభంగా జరగదని, ఇది వాస్తవంగా వారి మధ్య ఉన్న విభేదాలనే రుజువు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందే సాయి ధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ను అన్ఫాలో చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే చేసేయడంతో, రెండు కుటుంబాల మధ్య బంధం మరింత దూరమైనట్టు స్పష్టమవుతోంది. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం ఇప్పటికీ అల్లు అర్జున్ను ఫాలో అవుతుండటం ఆసక్తికరమైన విషయంగా మారింది.