విమాన ప్రయాణికులకు శుభవార్త! ఎయిరిండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ కొత్త ‘పేడే సేల్’ ద్వారా ప్రయాణికులు తక్కువ ధరలకే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలుగుతోంది. ఇందులో భాగంగా, ఎక్స్ప్రెస్ లైట్ ఫేర్స్ కేవలం రూ. 1385 నుంచి ప్రారంభం అవుతుండగా, ఎక్స్ప్రెస్ వాల్యూ ఫేర్స్ రూ. 1535 నుంచి లభించనున్నాయి. ఈ ఆఫర్లో భాగంగా బుకింగ్లకు 2025, మార్చి 2 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రయాణ సమయం 2025, మార్చి 1 నుండి సెప్టెంబర్ 19 వరకు అందుబాటులో ఉంటుంది.

కన్వీనియన్స్ ఫీజు, ఇతర అదనపు ఛార్జీలు వేరు
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్ ఈ ప్రత్యేక ఆఫర్లో బేస్ ఫేర్, టాక్స్లు, ఎయిర్పోర్ట్ ఛార్జీలు ఈ ధరలోనే కలిపి ఉంటాయి. అయితే కన్వీనియన్స్ ఫీజు, ఇతర అదనపు ఛార్జీలు వేరుగా ఉండొచ్చు. కానీ, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే కన్వీనియన్స్ ఫీజు చెల్లించనవసరం ఉండదు. ఈ లైట్ ఆఫర్ లోయల్టీ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. లోగిన్ అయిన సభ్యులకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఉదాహరణకు, ప్రైమ్ మరియు స్టాండర్డ్ సీట్లపై 25% తగ్గింపు, బిజినెస్ సీటింగ్ అప్గ్రేడ్పై 50% తగ్గింపు, అదనపు 10 కేజీల లగేజీపై 25% తగ్గింపు అందుబాటులో ఉన్నాయి.
రూ. 11 ప్రారంభ ధరతో విమాన టికెట్లు
ఇక, అంతర్జాతీయ విమానయాన సంస్థ వియత్జెట్ కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేక సేల్ ప్రకటించింది. వియత్నాం కేంద్రంగా నడిచే ఈ సంస్థ కేవలం రూ. 11 ప్రారంభ ధరతో విమాన టికెట్లు అందిస్తోంది. అయితే, దీనిపై అదనంగా టాక్సులు మరియు ఇతర రుసుములు వర్తిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చి, ముంబై నగరాల నుంచి ప్రయాణించే వారికి ఈ అవకాశం లభించనుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 21న ప్రారంభమై, ఫిబ్రవరి 28 వరకు బుకింగ్ చేయవచ్చు. ప్రయాణానికి మార్చి 10 నుండి సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారందరికీ ఈ బంపర్ ఆఫర్లు ఎంతో ఉపయోగపడనున్నాయి.