ప్రముఖ సినీ నటుడు మరియు రాజకీయ విశ్లేషకుడు పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. సెక్షన్ 35(3) ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, అనంతరం అనూహ్యంగా సెక్షన్ 111 (వ్యవస్థీకృత నేరం) చేర్చడం కోర్టు ఆగ్రహానికి కారణమైంది. ఈ చర్యను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి, పోలీసు వ్యవస్థలో నియమాల్ని ఉల్లంఘించడమని పేర్కొంది.
సూళ్లూరుపేట CIకి కోర్టు నోటీసులు
పోసానిపై అదనపు సెక్షన్లు చేర్చడంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు సూళ్లూరుపేట సీఐకి నోటీసులు జారీ చేసింది. ముందస్తు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించడం హైకోర్టు అధికారాన్ని తక్కువగా చూపించే ప్రయత్నంగా భావిస్తామన్నారు న్యాయమూర్తులు. ఇది న్యాయ వ్యవస్థ పట్ల అవమానంగా మారే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

TTD ఛైర్మన్ను దూషించిన ఆరోపణలపై కేసు
పోసాని కృష్ణమురళి గతంలో TTD ఛైర్మన్పై చేసిన వ్యాఖ్యలపై TV5 చానెల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేసులో సెక్షన్ల చేర్పు పట్ల జరుగుతున్న చట్టవిరుద్ధ చర్యలు ఇప్పుడు న్యాయస్థానంలో తీవ్ర చర్చకు దారితీశాయి.ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.