90వ దశకంలో తెలుగు సినీ పరిశ్రమను తన అందంతో, అభినయంతో ఊపేసిన అగ్ర కథానాయిక రంభ మరోసారి వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రంభ, వివాహం అనంతరం సినిమాలకు దూరమైంది. అప్పటితరం ప్రేక్షకులలో ఎంతో మందికి ఇప్పటికీ రంభ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇప్పుడు రంభ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తన రీఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
రీఎంట్రీ
ఇప్పటికే చాలా మంది సీనియర్ బ్యూటీలు ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా ఇప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు.ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టింది. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది.
సినిమా నా ఫస్ట్ లవ్
రంభ గ్లామర్, నటన, ఆమె గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి ఆడియెన్స్ ఫిదా అయ్యేవారు. రంభ తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకుని, మళ్లీ ఆడియెన్స్ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.ఎలాంటి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

సినీ కెరీర్
ఆ ఒక్కటి అడక్కు తెలుగు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల సరసన నటించింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది.తమిళంలో విజయ్, అజిత్ వంటి టాప్ హీరోలతో నటించింది.పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులకు అర్థవంతమైన రీతిలో కనెక్ట్ కావాలనుకుంటున్నానని చెప్పింది.