నటి ప్రియాంకా చోప్రా ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుని ఆసక్తికరంగా వివరించారు. “శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మనందరికీ శాంతి, శ్రేయస్సు, మరియు సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుడి దయ అనంతం. ఓం నమో నారాయణ” అంటూ ఆమె పోస్ట్లో పేర్కొన్నారు. చివర్లో రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం ద్వారా దర్శన ఏర్పాట్లలో ఆమె భాగమున్నట్లు వెల్లడించారు.

ప్రియాంకా ఇటీవల లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇదే సమయంలో, మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 సినిమాలో ప్రియాంకా హీరోయిన్గా ఎంపికైనట్లు నెట్టింట పుకార్లు వినిపించాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె నగరానికి వచ్చారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ప్రియాంకా తన పూజ అనంతరం “కొత్త జర్నీ ప్రారంభమవుతోంది” అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.అయితే ఇప్పటివరకు SSMB29 మూవీ టీం నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రియాంక ఈ ప్రాజెక్ట్లో భాగమా లేక వేరే కారణాలకోసం హైదరాబాద్కు వచ్చారా అన్నది ఇప్పటికీ సందేహమే.కానీ, ప్రియాంకా చోప్రా వంటి గ్లోబల్ స్టార్, తెలుగు సినీ పరిశ్రమలో భాగమవడం అనేది ప్రేక్షకులకు ఎంతో ఉత్సాహకరమైన విషయం.మొత్తానికి, ప్రియాంకా పూజారాధన, ఆమె హైదరాబాద్ పర్యటనతో పాటు ఈ సినిమాపై వస్తున్న పుకార్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా, ఇప్పుడు తెలుగు సినీప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ వార్తలు నిజమైతే, ప్రియాంకా చోప్రా-మహేశ్ బాబు కాంబినేషన్ ప్రేక్షకులకు విశేషంగా హర్షం కలిగించేదే.