Hansika: ప్రముఖ నటి హన్సిక తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోదరుని భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. హన్సిక పిటిషన్పై విచారించిన.. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్.ఎం.మోదక్లతో కూడిన ధర్మాసనం ఆమె సోదరుని భార్యకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్ జేమ్స్ను 2020లో వివాహం చేసుకున్నారు.

తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ
కొన్ని కారణాల వల్ల 2022లోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇదే సమయంలో హన్సిక సహా సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై.. ముస్కాన్ గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరిలో హన్సిక, జ్యోతిలకు ముంబయి సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత విచారణ సాగుతోంది. తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ తాజాగా హన్సికతో పాటు ఆమె తల్లి కూడా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా హన్సిక వెలుగొందారు. అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’ సినిమాతో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే, కందిరీగ, బిల్లా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అటు తమిళంలోనూ విజయ్, ధనుష్, శింబు వంటి స్టార్ హీరోల సరసన నటించారు. ఆ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. పలు సిరీస్ల్లోనూ నటించారు. అలాగే, హారర్ జానర్లోనూ పలు సినిమాల్లో నటించారు. గార్డియన్, శ్రీ గాంధారి సినిమాల్లో నటించారు.