हिन्दी | Epaper
సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

HCA : HCA అక్రమాల కేసులో నిందితులకు బెయిల్

Sudheer
HCA : HCA అక్రమాల కేసులో నిందితులకు బెయిల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసు నుంచి ముగ్గురు నిందితులు బెయిల్‌పై బయటపడ్డారు. మల్కాజ్‌గిరి కోర్టు వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అనుకూలంగా పరిశీలించి, ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే HCA ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావును మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించాలన్న CID పిటిషన్‌ను మాత్రం కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో జగన్మోహన్‌రావు, సునీల్‌ల పిటిషన్లపై సోమవారం వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.

ఇకపోతే, ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చిన అక్రమాల కంటే భిన్నంగా HCAలో మరో పెద్ద స్కామ్ బయటపడింది. తాజా సమాచార ప్రకారం, HCA అధిపతులు సమ్మర్ క్యాంపుల పేరుతో సుమారు రూ.4 కోట్ల వరకు అక్రమంగా వడ్డించారని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపుల్లో ఒక్కో క్యాంప్‌లో 100 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చామన్న తప్పుడు లెక్కలు చూపించారని సీఐడీ గుర్తించింది. మొత్తంగా 2,500 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చినట్లు చూపించి నిధులు దారి మళ్లించినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో HCAలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు జస్టిస్ నవీన్‌రావును ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆయన ఆధ్వర్యంలో సంస్థ ఆర్థిక వ్యవహారాలను, క్రికెట్ అభివృద్ధికి జరిగిన ఖర్చులను సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ కేసు HCA పరిపాలనలో ఉన్న లోపాలను, రాజకీయ హస్తక్షేపాలను మరోసారి బయటపెడుతూ రాష్ట్ర క్రికెట్ పరిపాలన విధానాలపై ప్రశ్నలు రేపుతోంది.

Read Also : Devaraj : హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ అరెస్టు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870