A total of 67 people died in the plane crash.. America revealed.

విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. అమెరికా వెల్లడి..!

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్టు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్ లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టులో అమెరికన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ని గాలిలోనే ఢీ కొట్టింది. దీంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది.

image

మిడ్ ఎయిర్ లో విమానం-హెలికాప్టర్ ఢీ కొని సమీపంలోని ఫోటో మాక్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 28 మృతదేహాలను వెలికి తీశారు. హెలికాప్టర్ లోని మొత్తం సిబ్బందితో పాటు విమానంలోని ప్రయాణికులు మొత్తం 67 మంది మరణించినట్టు సీనియర్ అగ్నిమాపక అధికారి తెలిపారు. తాము ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ నుంచి మృతదేహాల రికవరీ ఆపరేషన్ కి మారుతున్న దశలో ఉన్నామని వాషింగ్టన్ అగ్నిమాపక అధికార జాన్ డొన్నెల్లీ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.

కాగా, వాషింగ్టన్ డీసీ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఓ చిన్న విమానం, హెలికాప్టర్ ను గగన తలంలో ఢీకొని పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో కుప్పకూలాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ వాన్స్ విచారం వ్యక్తం చేశారు. రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో జరిగిన ప్రమాదం గురించి అధికారులు తనకు వివరించారన్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని పర్యవేక్షించడంపై ఓ ప్రకటనలో స్పందించారు.

Related Posts
రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ ఆరోపణలు – అంబటి

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూ తయారీలో కల్తీ Read more

మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసులో ట్విస్ట్
Meerpet Madhavi Murder Case

హైదరాబాద్ మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సంక్రాంతి రోజు తన భార్య మాధవిని రిటైర్డ్ జవాన్ గురుమార్తి దారుణంగా హత్య Read more

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం – విజయసాయి రెడ్డి
polavaram

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పలు అంశాలను ప్రస్తావిస్తూ, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు Read more

నిర్మాత మనో అక్కినేని కన్నుమూత
Producer Mano Akkineni pass

తమిళ సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాతగా పేరు పొందిన మనో అక్కినేని ఈ నెల 19న కన్నుమూశారు. అయితే ఈ విషాదకర సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *