VISHAKHAPATNAM

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం స్టేడియం

ఆంధ్రప్రదేశ్‌లో మరో స్టేడియం నిర్మించనున్నారు. ఈ మేరకు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో దివ్యాంగుల కోసం రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలో మంత్రితో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని రాష్ట్ర పారా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ 2025 పోటీలకు ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని.. దివ్యాంగులకు పింఛన్‌ను రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచిందని.. మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ. 15,000 ఇస్తున్నామని గుర్తు చేశారు. అలాగే దివ్యాంగ విద్యార్థులకు పింఛన్‌ డబ్బుల్ని ప్రతినెల వారి బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తున్నామన్నారు. అలాగే దివ్యాంగ విద్యార్ధులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, త్రీ వీలర్స్‌ అందజేస్తున్నామన్నారు.


విశాఖపట్నంలో ఇప్పటికే క్రికెట్ స్టేడియం ఉంది.. నగరంలో మరో స్టేడియం కూడా ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.. భోగాపురంలో కూడా క్రికెట్ స్టేడియం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి కూడా దివ్యాంగులకు స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. మరోవైపు ఈనెల 31 నుంచి వచ్చేనెల 2 వరకు నిర్వహించనున్న అరకు ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.కోటి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు తిరుపతి జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఫ్లెమింగో ఉత్సవాలకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. అలాగే సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 285వ జయంతి వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ వేడుకలను ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు.

Related Posts
ఇండియా టుడే సర్వేలో సీఎం చంద్రబాబుకు 4వ స్థానం
TTD and railway services on WhatsApp.. CM Chandrababu

రాష్ట్ర ప్రజలకు గర్వకారణం జాతీయ స్థాయిలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా Read more

రాజధానిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
Affidavit of AP Govt in Supreme Court on capital

అమరావతి: అమరావతి నిర్మాణం చుట్టూ గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా Read more

బోరుగడ్డకు రాచమర్యాదలు చేసిన పోలీసులు సస్పెండ్
anil

బోరుగడ్డ అనిల్ కేసులో మరో నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అనిల్ కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, Read more

రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ విజయమ్మ మరో లేఖ
Another letter of YS Vijayamma to the people of the state

అమరావతి : కర్నూలులో కొన్ని రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలపై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *