हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Ayodhya : రేపు అయోధ్యలో అద్భుత ఘట్టం.. రామయ్య నుదుటిపై సూర్య తిలకం

sumalatha chinthakayala
Ayodhya : రేపు అయోధ్యలో అద్భుత ఘట్టం.. రామయ్య నుదుటిపై సూర్య తిలకం

Ayodhya : చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఆ ఆదర్శ శ్రీరాముని జన్మదినమే శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అదే రోజున సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేపు(ఆదివారం) శ్రీ రామనవమి పండుగను యావత్ దేశం అంగరంగా వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నవమి సందర్భంగా శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. బాలరామునికి సూర్యభగవానుడు సూర్య తిలకం దిద్దుతున్నారా అన్నట్లు దృశ్యాలు కనిపిస్తాయి.

 రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో

సూర్యభగవానుడు బాలరాముడికి తిలకమై మెరవనున్నాడు

ఈ నేపథ్యంలో లోకానికి వెలుగు ఇచ్చే సూర్యభగవానుడు రేపు(ఆదివారం) బాలరాముడికి తిలకమై మెరవనున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఈ అద్భుత దృశ్యాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు కనువిందు చేయనుంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది శ్రీరామనవమికి తొలిసారి ఆదిత్య భగవానుడు బాలరాముడిని నుదిటిని తాకిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది శ్రీరామనవమికి బాలరాముడి నుదిటి పైకి భానుడి కిరణాలు ప్రసరించేలా ఆలయం నిర్మించారు. కాంతి గుడి శిఖరాన్ని తాకే మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహాన్ని చేరేలా కుంభాకార, పుటాకార కటకాలు అమర్చారు. ఇక పోతే ఈ ఏడాది(రేపు) ఆవిష్కృతం అవ్వబోతున్న ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అంతేకాదు ఈ అద్భుతాన్ని చూసేందుకు భారీగా రాములోరి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.

Read Also: ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870