हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Jagan : ప్రజలకు అండగా నిలబడితేనే లీడర్ – జగన్

Sudheer
Jagan : ప్రజలకు అండగా నిలబడితేనే లీడర్ – జగన్

తాను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజల కోసం అని, పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా తన విలువలు, విశ్వసనీయతను తాకట్టు పెట్టలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) పేర్కొన్నారు. తాడేపల్లిలో యువ వైసీపీ నాయకులతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, ప్రజలకు అండగా నిలబడితేనే నిజమైన నాయకుడిగా గుర్తింపు వస్తుందన్నారు. నాయకుడు అంటే కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉండేవాడిగా ఉండాలని భావించాలన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం

రాజకీయ నాయకుడు ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉండాలని జగన్ హితవు పలికారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాదు, వాటికి తగిన పరిష్కార మార్గాలు చూపడం నాయకత్వ లక్షణమని తెలిపారు. యువ నాయకులు ప్రజలతో నిత్యం మమేకమై ఉండాలని సూచించారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి నాయకుడూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సోషల్ మీడియాలో యువత పాత్ర కీలకం

జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వ అన్యాయాలను, దుర్వినియోగాలను సామాజిక మాధ్యమాల (Social Media) ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ‘‘మీరు చేసే ప్రతి పోస్ట్, ప్రతి వీడియో, ప్రతి సందేశం ప్రజలకు నిజం తెలియజేసే ఆయుధంలా పనిచేస్తుంది,’’ అని జగన్ పేర్కొన్నారు. నిజాన్ని ప్రచారం చేయడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రజాస్వామ్య పరిరక్షణలో యువ నాయకత్వం కీలకంగా మారాలని ఆకాంక్షించారు.

Read Also : Pawan Kalyan : పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870