Eluru District: తల్లిదండ్రుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో కూల్డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగిన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
Read Also: LPG Shortage : స్విగ్గీ, జొమాటో బంద్..! ఏపీలో హోటల్స్ సంచలన

చికిత్స పొందుతూ మృతి
బుట్టాయగూడెం మండలం మర్రిగూడేనికి చెందిన పూనెం నాగేంద్రబాబు, కుమారి దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో మంగళవారం కూడా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో తన భర్తను బెదిరించేందుకు భార్య కుమారి పొగాకు తోటకు చల్లే జిడ్డుమందు కూల్డ్రింక్ సీసాలో తెచ్చి ఇంటివద్ద కంచెకు పెట్టింది. దురదృష్టవశాత్తూ, ఆ సీసాలో ఉన్నది పురుగుల మందు అని తెలియక, అది కూల్డ్రింక్ అనుకొని వారి ఐదేళ్ల కుమార్తె తాగేసింది.
వెంటనే అస్వస్థతకు గురైన చిన్నారిని చూసి కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, మందు ప్రభావం తీవ్రంగా ఉండటంతో పరిస్థితి విషమించి బుధవారం ఆ చిన్నారి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: