CM Chandrababu: రాష్ట్రంలో పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, కీలక మార్పులకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గడిచిన 20 నెలల్లో పాలనలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి.
Read Also: Jagan Mohan Reddy: ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

విద్యుత్ ఛార్జీల భారం మరింత తగ్గింపు
ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు, పథకాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయని.. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని, పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా అమలు చేయాలని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్ పేరిట ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక ట్రూడౌన్ చేశామని, విద్యుత్ చార్జీల భారం మరింత తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: