ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న వేళ.. ఇరాన్ ప్రభుత్వం తన పౌరులపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్లు ఎవరైనా అమెరికా లేదా ఇజ్రాయెల్కు మద్దతు తెలిపినా లేదా ప్రస్తుత యుద్ధ పరిణామాలపై సంబురాలు చేసుకున్నా వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారు తీవ్రమైన చట్టపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్(Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీంగా ఇరాన్ ప్రకటించగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయితే ఖమేనీ మరణంపై అమెరికా, యూరప్లలో నివసిస్తున్న కొందరు ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడం టెహ్రాన్ పాలకులకు ఆగ్రహం తెప్పించింది.
Read Also: Flight ticket price increase : దుబాయ్ ఎయిర్పోర్ట్లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

స్థిర, చర ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం
“విదేశాల్లో ఉంటున్న ప్రజలు శత్రువైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఏ రూపంలో మద్దతు ఇచ్చినా, సమర్థించినా.. వారిని దేశద్రోహులుగా పరిగణిస్తాం. అలాంటి వారి స్థిర, చర ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది” అని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ప్రముఖుల వివరాలను సేకరించడానికి కొన్ని ప్రత్యేక టెలిగ్రామ్ ఛానళ్లు రంగంలోకి దిగాయి. ఇరాన్ ప్రభుత్వం జారీ చేసిన ఈ హెచ్చరికలపై విదేశాల్లోని కొందరు ఇరానియన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. లండన్లో నివసిస్తున్న మేయం అఘాఖానీ అనే వ్యాపారి స్పందిస్తూ.. “ఇరాన్లో ప్రజలు ఎటువంటి ఆయుధాలు లేకుండా తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పిస్తున్నారు. అలాంటి తరుణంలో విదేశాల్లో ఉన్న మా ఆస్తుల గురించి మేము చింతించడం లేదు. మా పోరాటం ఆగదు” అని తెగేసి చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: