Medak Municipal Council: జిల్లా కేంద్రం అయిన మెదక్ మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం లో నిర్వహించారు. మొదటి సమావేశం కావడంతో ముఖ్య అతిథులుగా స్థానిక ఎ మ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు, ఎంఎల్సీ అంజి రెడ్డి లు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ కనుగు రాధిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం లో ఆమె భర్త కనుగు భూపతి రాజ్ ఏ నిబంధనల ప్రకారం కు అధికారిక హోదా కల్పించారా అనే సందేహాలు తలెత్తాయి.
Read Also:Delhi Liquor Scam: కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

అప్పటికే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అనధికారిక వ్యక్తులు ఎవరు ఉండ కూడదు అని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన అధికారులతో సమానంగా ముందు వరుసలో కూర్చోవడం గమనార్హం. మహిళలకు పెద్ద పీట వేయాలని రిజర్వేషన్లు కల్పించినప్పటికి ఇలాంటి చర్యల వల్ల ఆ రిజర్వేషన్లకు ఉపయోగం లేకుండా పోతుందని విశ్లేలకులు భావిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: