Harry Brook: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు. వాంఖడే వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో కేవలం 7 పరుగుల తేడాతో విజయం చేజారడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ క్యాచ్ను వదిలేయడమే తమ పతనానికి నాంది పలికిందని బ్రూక్ అంగీకరించాడు.
Read Also: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది
ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ కేవలం 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఒక సునాయస క్యాచ్ను హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఈ లీఫ్ ఆఫ్ లైఫ్ను సంజూ అద్భుతంగా సద్వినియోగం చేసుకుని 89 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.చెత్త ఫీల్డింగ్తో పాటు పేలవ బౌలింగ్ తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఈ మ్యాచ్లో ఓడినా తమ జట్టు పోరాడిన తీరు గర్వంగా ఉందని చెప్పాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కూడా తమ జట్టు వెనుకడుగు వేయలేదని తెలిపాడు.’పిచ్ తాజాగా ఉండటం వల్ల ఆరంభంలో బంతి కొంచెం ఆగుతూ వస్తుందని మేం భావించాం.
తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు ఎక్కువ సహకారం ఉంటుందని ఊహించాం. దాంతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ బంతి బ్యాట్పైకి బాగా వచ్చింది. నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను. సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను అందుకోలేకపోయాను. ‘క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయి’అని అంటారు కదా. దురదృష్టవశాత్తు ఈ రాత్రి మా ఫీల్డింగ్ అనుకున్నట్లు సాగలేదు. ప్రణాళికల అమల్లో కూడా తప్పిదం జరిగింది.
బౌలింగ్లో కూడా మేం సరిగ్గా రాణించలేదు. జాకబ్ బెతెల్ మాత్రం అద్భుతంగా ఆడాడు. క్రికెట్లో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. భారీగా సంపాదిస్తాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనేంటో ప్రపంచానికి చూపించాడు. మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించమని గతంలోనే చెప్పాను. 250 పరుగులు ఛేజ్ చేస్తూ ఈ రాత్రి అదే నిరూపించాం. ఇతర జట్లు అయితే ఈ పాటికి చేతులెత్తేసి కుప్పకూలిపోయేవి.’అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: