AP Government: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాహనదారులకు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో మోటారు వాహనాలపై అదనంగా మరో 10 శాతం సెస్ పెంచేందుకు వీలుగా ప్రభుత్వం మోటారు వాహన పన్ను సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులపై ఈ నిర్ణయం అదనపు భారంగా మారనుంది.
Read also: Andhra Pradesh: మద్యం విక్రయాల్లో డిజిటల్ విప్లవం: కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్!

అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి బిల్లు ప్రవేశం
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ‘ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు (సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టారు. రహదారి ప్రమాదాల నివారణకు మరియు ప్రత్యేక భద్రతా నిధి ఏర్పాటుకు ఈ సవరణలు చేసినట్లు మంత్రి వివరించారు. ఈ బిల్లు ప్రకారం, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే జీవితకాల పన్ను (Life Tax) పై అదనంగా 10 శాతం భద్రతా సెస్ వసూలు చేస్తారు.
ప్రభుత్వ లక్ష్యం మరియు ఆదాయ అంచనా
రహదారి భద్రత కోసం ప్రభుత్వం చెబుతున్న ప్రధాన అంశాలు ఇవే:
- ప్రమాదాల నివారణ: ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల మెరుగుదల, రోడ్డు భద్రతా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వాడతారు.
- ఆదాయం: ఈ సెస్ ద్వారా నెలకు సుమారు రూ. 22.5 కోట్లు, ఏడాదికి రూ. 270 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రభుత్వం దీనిని ప్రజా ప్రయోజనం కోసమే అని చెబుతున్నా, వాహన కొనుగోలుదారుల జేబులకు మాత్రం భారీగా చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: