తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం కాంగ్రెస్కు దక్కే స్థానాల కోసం ఆశావహుల సంఖ్య పెరగడంతో హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి ప్రముఖ న్యాయవాది, ఏఐసీసీ (AICC) కీలక నేత అభిషేక్ మను సింఘ్వీకి దక్కడం దాదాపు ఖాయమైపోయింది. అయితే, రెండో స్థానం కోసం రాష్ట్ర నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ఆప్తుడైన వేం నరేందర్ రెడ్డికి ఈ అవకాశం కల్పించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, ఏఐసీసీలో ఉన్న పట్టుతో పాటు ప్రియాంక గాంధీ ద్వారా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Also : US Attack : ట్రంప్ వీకెండ్ దాడుల వెనుక – మార్కెట్ వ్యూహం ?
ఈ ఉత్కంఠ భరిత రేసులోకి అనూహ్యంగా రమణ నాయక్ పేరు వచ్చి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈయన అత్యంత సన్నిహితుడు మాత్రమే కాకుండా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనూ ఈయనకు సత్సంబంధాలు ఉండటం విశేషం. సామాజిక సమీకరణాలు, రాజకీయ వ్యూహాల నేపథ్యంలో రమణ నాయక్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గిరిజన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే రమణ నాయక్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తుది నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. సామాజిక వర్గాల సమతుల్యత పాటించాలా? లేక ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలా? అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. సీనియర్ నేతలు మధు యాష్కీ గౌడ్, వి. హనుమంతరావు వంటి వారు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి పోరు ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి మరియు రమణ నాయక్ మధ్యే కేంద్రీకృతమై ఉంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :