Elnaz Norouzi: ప్రముఖ వెబ్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ ద్వారా భారత్లో గుర్తింపు తెచ్చుకున్న ఇరానియన్ నటి ఎల్నాజ్ నొరౌజీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పతనమయ్యే వరకు తాను తన మాతృభూమిలో అడుగుపెట్టలేనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన వార్త వినగానే ఆమె సంబరాలు చేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
Read Also:Iran: కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇరాన్కు వెళ్లడం ప్రాణాపాయంతో కూడుకున్న పని అని ఎల్నాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు, తాను ఇరాన్ గడ్డపై అడుగుపెడితే తనను చంపేసే అవకాశం ఉందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇరాన్ పాలక వర్గంపై ఉన్న వ్యతిరేకతను ఆమె బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు.
ఎల్నాజ్ నొరౌజీ నేపథ్యం చూస్తే, ఆమె తన ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఇరాన్ను వీడి వెళ్ళిపోయారు. అనంతరం యూరప్లో స్థిరపడి, అక్కడ మోడలింగ్లో శిక్షణ పొందారు. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో భారత్కు చేరుకుని ఇక్కడ కెరీర్ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఇండియాలోనే ఉంటూ తన వృత్తిపరమైన పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: