Missile Attack on AliKhamenei: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాసం (కాంపౌండ్) లక్ష్యంగా భారీ క్షిపణి దాడి జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 30 క్షిపణులతో జరిగిన ఈ విలయంలో ఖమేనీ కుటుంబ సభ్యులతో పాటు కీలక సైనిక కమాండర్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
Read Also: Trump Iran war : ఇరాన్పై దాడుల నిర్ణయంతో ట్రంప్పై అమెరికాలో రాజకీయ వివాదం
Missile Attack on AliKhamenei: కుటుంబ సభ్యులే లక్ష్యంగా..
ఈ దాడిలో ఖమేనీ కుమార్తె మరియు అల్లుడు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. వారితో పాటు ఖమేనీ కోడలు, మనవరాలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ దాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన 40 మంది ఉన్నత స్థాయి కమాండర్లు హతమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఖమేనీ నివాసం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.
అలీ ఖమేనీ భార్య మన్సౌరా ఖోజాస్తే, మషద్లోని ప్రముఖ వ్యాపారవేత్త మొహమ్మద్ ఎస్మాయిల్ ఖోజాస్తే బఘెర్జాదే కుమార్తె. ఆమె సోదరుడు హసన్, ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా నెట్వర్క్ (IRIB)కి మాజీ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. ఇరాన్ అధికార యంత్రాంగంలో అత్యంత ప్రభావవంతమైన ఈ కుటుంబమే లక్ష్యంగా దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అయితే, ఈ దాడిని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ మరియు కీలక ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: