Ugadi 2026: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం ముస్తాబవుతోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Milk contamination : రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం
మార్చి 16 నుంచి 20 వరకు ఉత్సవాలు
శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలను ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

10 రోజుల పాటు స్పర్శ దర్శనం భాగ్యం
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది ఉత్సవాల రద్దీ మొదలవ్వకముందే, ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు (మొత్తం 10 రోజులు) భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. సామాన్య భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి మల్లికార్జున స్వామిని తాకి దర్శించుకునే ఈ అవకాశం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్ర భక్తులకు భారీ ఏర్పాట్లు
ఉగాది సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రల నుండి లక్షలాది మంది భక్తులు కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. పాదయాత్ర మార్గాల్లో భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లలో నిరంతర మంచినీటి సరఫరా, వైద్య సదుపాయాలు మరియు అన్నప్రసాద వితరణ కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: