టెక్ రంగ ప్రముఖుడు జాక్ డోర్సీ తన ఆర్థిక సేవల సంస్థ బ్లాక్లో దాదాపు 4000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ లాభాల్లోనే ఉన్నప్పటికీ కేవలం సామర్థ్యాన్ని పెంచుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) సాయంతో తక్కువ మంది సిబ్బందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయవచ్చని ఆయన బలంగా నమ్ముతున్నారు.
Read also: Apple: పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

Massive job cuts at Black company
ఏఐతో పెరగనున్న ఆర్థిక అసమానతలు
ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ఏఐ ప్రభావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సాంకేతికత ధనికులను మరింత ధనవంతులుగా మారుస్తుందని, సామాన్య ఉద్యోగులు మాత్రం ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కంపెనీ యజమానులు ఖర్చు తగ్గించుకుని లాభాలు గడిస్తారని, కానీ శ్రమపడే వర్గానికి ఇది గడ్డుకాలమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ముంచుకొస్తున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం
సిట్రిని రీసెర్చ్ నివేదిక ప్రకారం 2028 నాటికి ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. వేగంగా మారుతున్న సాంకేతికత వల్ల చాలా రంగాల్లో మానవ అవసరం తగ్గిపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. భవిష్యత్తులో ఈ మార్పులు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ఆందోళన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: