YS Jagan: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను వెంటనే స్వదేశానికి రప్పించాలని మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని కోరారు. నిత్యం లక్షలాది మంది తెలుగు వారు గల్ఫ్ దేశాల్లో శ్రమిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు.
పలు గల్ఫ్ దేశాల్లో గగనతలాన్ని మూసివేయడం ,అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రవాసాంధ్రులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారని జగన్ గుర్తు చేశారు. స్వదేశానికి రావాలనుకుంటున్న వారికి మార్గం లేక, అక్కడ ఉండలేక వారు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.
Read Also: Indian Diplomacy : నైపుణ్యత మెరుగుపడిన భారత్ దౌత్యనీతి

కుటుంబాలకు భరోసా కల్పించాలి
ఈ సంక్షోభ సమయంలో బాధితులకు అండగా నిలవాలని కోరుతూ జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ క్రింది సూచనలు చేశారు. భారత విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపి, గల్ఫ్లో చిక్కుకున్న వారిని రప్పించే ప్రక్రియను వేగవంతం చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక విమానాలు (Evacuation Flights) ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు, వారి సమస్యలను నమోదు చేసుకునేందుకు తక్షణమే ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రారంభించాలి.
గల్ఫ్లో ఉన్న వారి పరిస్థితి తెలియక ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తామనే భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: