BCCI: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ సోమవారం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పురుషుల జట్టు జూన్ 2026లో భారత్లో పర్యటించనుందని వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఒక టెస్టు మ్యాచ్ మరియు మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 6 నుంచి జూన్ 20 వరకు ఈ సిరీస్ కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సిరీస్ ఏకైక టెస్టు మ్యాచ్తో ప్రారంభమవుతుంది. జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్లోని పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్ ప్రతీరోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇది రెండో టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.
Read Also: IND vs AFG 2026 Schedule: భారత్-అఫ్గాన్ సిరీస్.. టెస్ట్, వన్డేల వేదికలు ఇవే!

టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం వన్డే సిరీస్ మొదలవుతుంది. జూన్ 14న ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో తొలి వన్డే, జూన్ 17న లక్నోలోని ఏకానా స్టేడియంలో రెండో వన్డే జరగనున్నాయి. సిరీస్లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్కు చెన్నై వేదిక కానుంది. ఈ మ్యాచ్ జూన్ 20న జరుగుతుంది. అన్ని వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఈ సిరీస్ వివరాలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధికారికంగా ధృవీకరించారు. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇది మల్టీ-ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్గా జరగనుందని, భారత హోమ్ సీజన్లో ఈ పర్యటన చాలా ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. కొత్త వేదిక న్యూ చండీగఢ్లో మ్యాచ్ జరగనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: