
Iran Attack: ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతికారంగా ఆ దేశం భీకర దాడులకు శ్రీకారం చుట్టింది. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన కొద్ది గంటల్లోనే, ఇరాన్ సైన్యం పశ్చిమాసియాలోని అమెరికా లక్ష్యాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ మెరుపు దాడులతో మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరో ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
Read Also:B2 Spirit: ఆకాశంలో అజేయ మృత్యుపాశం!
పశ్చిమాసియా వ్యాప్తంగా విస్తరించి ఉన్న సుమారు 27 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడులను నిర్వహించింది. కేవలం సైనిక స్థావరాలే కాకుండా, దౌత్య కార్యాలయాలపై కూడా ఇరాన్ విరుచుకుపడింది. ఇందులో భాగంగా కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) పై ఇరాన్ దాడులకు తెగబడటం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది.
అమెరికా మిత్రదేశాల్లోని యూఎస్ ఎంబసీలు మరియు సైనిక కేంద్రాలను ఏకకాలంలో దెబ్బతీయడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా కూడా తన స్థావరాలను రక్షించుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలను సిద్ధం చేయడంతో, ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: