Gold demand today : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావంతో కేవలం రెండు రోజుల్లోనే పసిడి ధరలు ₹11,500కు పైగా పెరగడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. వెండి ధరలు కూడా అదే దిశగా భారీగా పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,320 డాలర్లను దాటి ట్రేడ్ అవుతోంది. ఇటీవల ఇది 5,200 డాలర్ల వద్ద ఉండగా, గత వారాల్లో 4,700 డాలర్ల స్థాయి నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది. వెండి ధర ఔన్సుకు సుమారు 92.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో రూపాయి మారకం విలువ డాలర్కు ₹91 ప్రాంతంలో ట్రేడ్ అవుతోంది.
Read Also: CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹4,370 పెరిగి ₹1,73,080కు చేరింది. ముందు రోజు ₹7,140 పెరగడంతో రెండు రోజుల్లో మొత్తం పెరుగుదల ₹11,500 దాటింది. 22 క్యారెట్ల బంగారం ధర ₹4,000 పెరిగి తులానికి ₹1,58,650 వద్ద ఉంది. వెండి ధర కిలోకు ₹5,000 పెరిగి ₹3.25 లక్షలకు చేరుకోగా, రెండు రోజుల్లో సుమారు ₹30,000 పెరుగుదల నమోదైంది.
భౌగోళిక ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు కొనసాగినంత కాలం బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: