టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా వినిపిస్తున్న ప్రేమ జంట వార్తలకు బలం చేకూరుస్తూ, స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు నటి రష్మిక మందన్న ఇవాళ హైదరాబాద్లోని టీటీడీ దేవస్థానాన్ని సందర్శించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయానికి చేరుకున్న ఈ జంట, వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను బహూకరించారు. విజయ్, రష్మిక ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో సందడి చేయడంతో అక్కడున్న భక్తులు వారిని చూసేందుకు ఆసక్తి చూపారు.
Uttar Pradesh Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!
ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన విజయ్, రష్మిక అభిమానులను చూసి ఆశ్చర్యపోయారు. తమను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపే క్రమంలో, వారు స్వయంగా అభిమానులకు స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. వారి ఈ చర్యతో అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. గత కొంతకాలంగా వీరిద్దరి వివాహ వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో, నేటి దర్శనం ఆ వార్తలకు మరింత ప్రాధాన్యతను సంతరించి పెట్టింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :