Sahibzada Farhan: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. 2014లో కోహ్లీ సాధించిన 319 పరుగుల మైలురాయిని, 12 ఏళ్ల తర్వాత ఫర్హాన్ అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
Read Also: PV Sindhu: దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు
పల్లెకెలె వేదికగా చారిత్రాత్మక ఇన్నింగ్స్
సూపర్-8 రౌండ్లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో ఫర్హాన్ ఈ ఘనత సాధించాడు. 2014 టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ అత్యద్భుత ప్రదర్శనతో 319 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, 12 ఏళ్ల తర్వాత ఫర్హాన్ దాన్ని అధిగమించాడు. శ్రీలంకతో మ్యాచ్కు ముందు ఫర్హాన్ ఈ రికార్డుకు 37 పరుగుల దూరంలో నిలిచాడు.

ఇవాళ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఫర్హాన్.. ఆరో ఓవర్ ఆరంభంలో దసున్ షనక బౌలింగ్లో ఫోర్ కొట్టి కోహ్లీ రికార్డును దాటేశాడు. ఈ టోర్నీలో ఫర్హాన్ భీకర ఫామ్లో ఉన్నాడు. నమీబియాపై సెంచరీ, ఇంగ్లండ్పై హాఫ్ సెంచరీతో రాణించాడు. కేవలం భారత్తో జరిగిన మ్యాచ్లో మాత్రమే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: