Medchal Crime: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నాగేష్తో పాటు గాంధీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సందీప్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
Read Also: Iran Attack: ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

పోస్టుమార్టం రిపోర్ట్ కోసం రూ. 2 లక్షల డిమాండ్
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఒక మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చేందుకు గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్, కీసర హోంగార్డు నాగేష్ కలిసి బాధితుడి వద్ద రూ. 2 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశారు. చివరకు అది లక్ష రూపాయలకు బేరం కుదిరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా అందాల్సిన రిపోర్ట్ కోసం ఇలా డబ్బులు అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.ఇవాళ కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బాధితుడి నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com