ఉత్తర కొరియాలో ‘కిమ్’ సామ్రాజ్యానికి కొత్త వారసురాలు సిద్ధమవుతోందా? ఆ దేశపు ఉక్కు కోటల వెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థల అంచనాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) తన వారసత్వ పగ్గాలను తన కుమార్తె కిమ్ జు యే(Kim Ju Ae)కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసిన కొన్ని ఫోటోలు అంతర్జాతీయ సమాజంలో సంచలనం సృష్టిస్తున్నాయి. సైనిక అధికారులకు స్నైపర్ రైఫిళ్లను బహుమతిగా ఇచ్చే కార్యక్రమంలో, కిమ్ కుమార్తె జు యే స్వయంగా ఒక రైఫిల్ను ఎయిమ్ చేస్తూ కనిపించారు. కేవలం తండ్రి పక్కన నిలబడటమే కాకుండా, సైనిక వ్యవహారాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్న తీరు చూస్తుంటే.. కిమ్ తర్వాత దేశ పగ్గాలు పట్టేది ఆమెనే అనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం

పార్టీ ఆమోదముద్ర పొందే దిశగా తెరవెనుక పావులు
వర్కర్స్ పార్టీ వేదికగా Kim పక్కా ప్లాన్.. ఉత్తర కొరియాలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ‘వర్కర్స్ పార్టీ’ సమావేశాలు తాజాగా ముగిశాయి. తనపై నమ్మకంతో పనిచేస్తున్న ప్రభుత్వ, సైనిక అధికారులకు కృతజ్ఞతగా కిమ్ రైఫిళ్లను బహూకరించారు. అయితే, ఈ వేదికపై కిమ్ తన కుమార్తెను అధికారిక వారసురాలిగా ప్రకటిస్తారని దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) అంచనా వేసినప్పటికీ, అటువంటి ప్రకటన ఏదీ నేరుగా రాలేదు. కానీ, పార్టీ ఆమోదముద్ర పొందే దిశగా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సోదరి, కిమ్ యో జోంగ్ కూడా పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె పార్టీ కేంద్ర కమిటీ జనరల్ అఫైర్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ, అంతర్గత పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: